Saturday, June 27, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 12

సహజ ఎంపిక ఫలితంగా ఒకరకమయిన ‘ సహజ సాంకేతికత ’ ద్వారా వివిధ జీవుల అవయవాలు అభివృద్ధి పొందినట్లు డార్విన్ పేర్కొన్నట్టు మాదిరిగానే మానవుల యొక్క పనిముట్లు, అవయవాలూ, సామాజిక పరిమాణం యొక్క ఉత్పత్తులు గా అభివృద్ధి చెందినవే. మానవుని యొక్క పనిముట్ల అభివృద్ది అనేది , అదే విధంగా ‘ సమానమైన ధ్యాస ’ పెట్టాల్సిన మానవ సమాజ పరిణామం పట్ల వహించాల్సిన వైఖరిని మనకు ఇవ్వట్లేదూ? అటువంటి చరిత్ర (మానవ పరిణామ)ను కూర్చడం అన్నది తేలికైన పనిగా ఉండదూ? ఎందుకంటే వైకో చెబుతున్నట్లు మానవ చరిత్ర ప్రకృతి చరిత్ర నుండి విభేదిస్తుంది. మానవ చరిత్రను మనం తయారు చేశాం. కానీ, ప్రకృతి చరిత్రను మనం తయారు చేయలేదు కనుక! అని మార్క్స్ చరిత్ర పట్ల వహించాల్సిన పరిణామవాద వైఖరిని సూచించారు.

1859 లో డార్విన్ తన ‘ జీవుల పుట్టుక ’ ప్రచురించడం ద్వారా తనయొక్క ‘ సహజ ఎంపిక ద్వారా పరిణామం ’ అన్న సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టే సమయంలోనే ‘ మానవ తెగలను గురించిన శాస్త్రపు అధ్యయన విప్లవకాలం ’ ప్రారంభమయి, ప్రపంచాన్ని గురించిన బైబులు పద్ధతి దృక్కోణంపై దాడి జరిపింది. అతి పురాతన కాలం నుండే భూమిపై మానవులు ఉనికిలో ఉన్నారు అన్న శాస్త్రీయ విజ్ఞాన ఆధారాలు 1856 లో కనుగొనబడ్డాయి. బైబులు భావిస్తున్నట్లు మానవులు కొద్ది వేల సంవత్సరాలుగానే ఉనికిలో ఉన్నారు అన్న అభిప్రాయాన్నిఈ ఆధారాలు నిరాకరించి ఖండించాయి.

ఈలోగా మోర్గాన్ తన మానవ శాస్త్ర అధ్యయనానికి సంబంధించిన ‘ పురాతన సమాజం ’ అన్న రచనను ప్రవేశవెట్టాడు. మార్క్స్ ఈ రచనపై ఆధారపడ్డ తన వైఖరి ద్వారా మానవులయొక్క పూర్తి ఉత్పత్తి , కుటుంబ సంబంధాల అభివృద్ధిని గురించి అవగాహనను రూపొందించుకునే ప్రయత్నం చేశాడు. ఈ రకంగా మతం యొక్క నిర్ణయాధికారపు పరిధి నుండి, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్ణయాధికార పరిధి యొక్క విస్తరణ జరిగింది.

అందువలన మార్క్స్ తన యవ్వన కాలంలో పెట్టుబడిని గురించిన విమర్శనాయుత పరిశీలనను అభివృద్ధి చేయడం కోసం చేసిన ప్రయత్నాన్ని, తనయొక్క మతంపై జరిపిన విమర్శనాత్మక పరిశీలన నుండి ఉద్భవించిన ప్రపంచాన్ని గురించిన మరింత మౌలికమైన భౌతికవాద/ మానవతావాద దృష్టిలో భాగంగా చూడాల్సి ఉంది.

ఇక మరణాన్ని గురించి మార్క్స్ ఈ విధంగా ఎపికారస్ చెప్పిన మాటలను పునరుల్లేఖించినట్లు ఏంగెల్స్ గుర్తుకు తెచ్చుకొని వివరించాడు. ‘ చచిపోయినవాడికి మరణం అనేది ఒక దురదృష్టం కాదు ’ , కానీ బ్రతికున్నవాడికే అది దురదృష్టం. ‘ ప్రపంచం భ్రమల నుండి ప్రత్యేకించి, మతం కల్పించిన దేవుళ్ళ పట్ల భయం నుండి వదిలించుకు బైటపడాలి, ఎందుకంటే ప్రపంచం నా మిత్రుడే కనుక! ’ అంటూ మార్క్స్ బలంగా వాదించాడు. మానవ స్వభావం యొక్క అభివృధ్ధి కొత్త అవసరాలు ఏర్పడటం మొదలైన అన్ని విషయాలతో కూడిన మానవ చరిత్ర అంతా, తమకు తాముగానే దేవుళ్ళ సహాయం లేకుడానే స్వయం మధ్యవర్తిత్వం నెరిపిన ప్రకృతి యొక్క జీవులైన మానవుల ద్వారానే తయారు చేయబడింది, అన్న విషయాన్నిమార్క్స్ ‘ దేవుళ్ళ సహాయం లేకుండానే వస్తువులు(జీవులు) ఉనికిలోకి వచ్చాయి ’ అని ల్యూక్రెటిస్ రాసిన దానిని అదనంగా చేర్చి చెప్పాడు.

( జాన్ బెల్లామీ పాస్టర్, బ్రెట్ క్లార్క, రిచర్డ యార్క్ లు సంయుక్తంగా రాసిన ‘ తెలివైన సృష్టిపై విమర్శనాత్మక పరిశీలన ’ అన్న గ్రంధంలోని అయిదవ అధ్యాయం యొక్క సంగ్రహ సారాంశం ఇది.)

No comments: