Saturday, June 13, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 9

ముందుగా మార్క్స్ మతంపై చేసిన విమర్శనాయుత పరిశీలన , ఊహాపూర్వక తత్వశాస్త్రం, తర్వాతి కాలంలో ఆయన బూర్జువా సమాజపు సిద్ధాంతంపై చేసిన విమర్శనాత్మక పరిశీలనకు ప్రాతిపదిక అయింది. ‘ మేధస్సును మత దర్శీకరణ చేయడం ’ అన్న రచనలో మార్క్స్ తాను బలీయంగా వ్యక్తం చేసిన భావనలు ,ప్రబలంగా ఉన్న భౌతిక సంబంధాలకు సంబంధించిన , ప్రబలంగావున్న భౌతికసంబంధాలనుండి గ్రహించిన భావనల ఆదర్శ వ్యక్తీకరణ తప్ప మరొకటి కాదు అని తెలియజేశాడు.
జర్మనీ దేశ సందర్భంగా ప్రస్తావిస్తూ ప్రొటెస్టెంట్ సంస్కరణల్లో ప్రత్యేకించి లూథరినిజం అన్నది ఎదుగుతూ ఉన్న బూర్జువా సమాజానికి తొడిగిన సరికొత్త మతపరమైన దుస్తులుగా మార్క్స్ తరుచూ పేర్కొనేవాడు.ఆ రకంగా ఆయన వ్యంగ్యంగా మార్టీన్ లూథర్ యొక్క వాదనల్లో పేర్కొన్న దోపిడి ప్రపంచపు ఉనికిని, దేముడియొక్క పథకరచనకు సాక్ష్యంగా చెప్పేవాడు. ఈ రకంగా మార్క్స్ అటు మతం పైన ఇటు పెట్టుబడి పైనా అనంతంగా విమర్శనాత్మక పరిశీలన జరిపాడు.
మార్క్స్ సూటిగానే, నేరుగా మతంతో తలపడ్డాడు. ఎందుకంటే ఆది (మతం) నైతికత, శాస్త్ర విజ్ఞానశాస్త్రాల రాజ్యం లోకి చొరబడింది. కనుక నైతిక అనేదాన్ని పునాదివాదపు లేదా సాపేక్షతావాద అంశాల పరిధుల్లో నిర్ణయించ వీలులేదు. నైతికతను మానవ సమూహాల భౌతిక అవసరాలతో పుట్టుకొచ్చిన నైతిక పరిస్థితులపై ఆధారపడ్డ విప్లవ చారిత్రాత్మక వాదపు అంశాలపై ఆధారపడి నిర్ణయించాలి. అందువల్లనే మార్క్స్ ‘ మార్మిక వైఖరి, దైవకృత లక్ష్యం, దైవం ’ లాంటి భావాలపై దాడి చేశాడు. మతం యొక్క అంతిమ కారణం నుండి పుట్టుకొచ్చే అన్ని పునాది వాదపు నైతికతనూ తిరస్కరించాడు. ఆయన మానవులే ‘ తమయొక్క స్వంత నాటకం యొక్క రచయితలూ, నటులూ ’ అని నొక్కి చెప్పాడు.
సంకుచితమైన మతపరమైన నైతికతను , రాజకీయ అర్ధశాస్త్రపు అభివృద్ధిపై మతపర నైతికతయొక్క ప్రభావాన్ని తెగనాడుతూ మార్క్స్ తన పెట్టుబడి గ్రంథంలో జనాభాను గురించిన సిద్ధంత కర్తల్లో ఎక్కువమంది ప్రొటంస్టెంట్ పురోహితులే. .... (రాజకీయ ఆర్ధిక శాస్త్రంలోకి ) జనాభా సిద్ధాంతం ప్రవేశించటంతోటే , ప్రొటెస్టెంట్ పురోహితుల సమయం మొదలయిందని పేర్కొన్నాడు. ఇటువంటి ఆలోచనాపరులు శాస్త్రవిజ్ఞానంనుండి వైదొలిగి , పాలకవర్గ సామాజిక వ్యవస్థను సమర్ధించడం కోసం, ప్రాకృతిక మత ధర్మశాస్త్రపు, మత నైతికత్వపు వాదనలను శాస్త్ర విజ్ఞాన రంగంలోనూ , రాజకీయ ఆర్ధికశాస్త్ర రంగంలోనూ అనుమతిస్తారనీ, మార్క్స్ వీరి ప్రవేశానికి (రాజకీయ ఆర్ధిక శాస్త్రరంగం లో) తన ప్రధాన అభ్యంతరాన్ని తెలియజేశాడు.

No comments: