Wednesday, April 7, 2010

Blogger Buzz: Blogger integrates with Amazon Associates

Blogger Buzz: Blogger integrates with Amazon Associates

కానూ సన్యాల్‌ది ఆత్యహత్య కాదు: జస్వంతరావు

విశాఖపట్నం, ఏప్రిల్ 7 (ఆన్‌లైన్): నక్సల్బరీ ఉద్యమ నాయకుడు కానూ సన్యాల్‌ది ఆత్యహత్య కాదని సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యుడు పి.జస్వంతరావు ప్రకటించారు. బుధవారం విశాఖ వీజెఎఫ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కానూ సన్యాస్ మరణానికి దారితీసిన పరిస్థితులను బేరీజు వేసుకుని త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఉద్యమంపై నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. ఇటువంటి నిరాధారమైన వదంతులను పార్టీ కేంద్ర కమిటీ తోసిపుచ్చిందని తెలిపారు.

ఇదంతా అసత్య ప్రచారంగా అభివర్ణించిందన్నారు. దేశంలో విప్లవ ఉద్యమాలను ఊపిరిలూదిన కానూ సన్యాల్ ఎప్పటికీ ఒంటరివాడు కానీ, నిరాశావాది అంతకంటే కాదని జస్వంతరావు పేర్కొన్నారు. ఆయన నమ్మిన ప్రజాపంథాకు అనుకూలంగా ప్రస్తుతం ఎనిమిది ర్రాష్టాల్లో ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు. కానూ సన్యాల్ నిరాశ చెందేలా విప్లవోద్యమాలు ఎక్కడా నష్టపోలేదని ఆయన వివరించారు. ఆయన తాను చేపట్టిన ఉద్యమాన్ని విస్తతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరేవారన్నారు. నక్సల్బరీ రైతాంగ పోరాటంలో చోటుచేసుకున్న అతివాద,అరాచకలకు వ్యతిరేకంగా సూత్రబద్ధ పోరాటాలు చేశారని తెలిపారు.

మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచన విధానాలతో విప్లవ ప్రజాయుద్ధం పంథాను అచరించడం ద్వారానే శ్రామిక వర్గానికి రాజ్యాధికారం సిద్ధిస్తుందని అభిప్రాయానికి వచ్చిన వ్యక్తి కానూ సన్యాల్ అని పేర్కొన్నారు. డార్జిలింగ్ పరిసరాల్లో తేయాకు తోటల కార్మికులు, ఆదివాసీల హక్కుల కోసం కానూ సన్యాల్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఆయన మతి పార్టీకి తీరనిలోటని, కానూ సన్యాల్ చేపట్టిన ఉద్యమాలను ముందుకు తీసుకువెళతామని తెలిపారు. విప్లవోద్యమాలలో పాల్గొన్న కానూ సన్యాల్ 14 ఏళ్లపాటు జైలు జీవితం గడిపారన్నారు. శ్రీకాకుళం సాయుధ పోరాటంలో భాగంగానే పార్వతీపురం కుట్ర కేసులో ముద్దాయిగా ఏడేళ్లు విశాఖ జైలులో వున్నారన్నారు.

ఆయన మతితో కళ్లు ఒత్తుకుంటూనే కానూ సన్యాల్ లేని లోటు పూరించడానికి నాయకత్వాన్ని పటిష్టం చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా విశ్వంను ఎన్నుకున్నట్టు ప్రకటించారు. కొత్త నాయకత్వంలో వర్గపోరుకు మరింత పదునెక్కిస్తామని జస్వంతరావు వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో పార్టీ విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి ఆడారి అప్పారావు, రైతు కూలీ సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి డి.వర్మ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, April 6, 2010

ప్రజా విప్లవ పంధా యోధుడు కామ్రెడ్ కానూ సన్యాల్

షహీద్, భగత్ సింగ్, సుఖదేవ్ లు అమరులైన 79వ వర్ధంతి రోజునే నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కామ్రెడ్. కానూ సన్యాల్ మనల్ని వీడిపోయారు. 65 యేళ్ళ సుదీర్ఘ కమ్యూనిష్టు ఉద్యమ చరిత్ర ఉన్న కామ్రెడ్ సన్యాల్ 1928లో మధ్యతరగతి ఉద్యోగి కుటుంబంలో జన్మించారు.ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు.తెలంగాణా, తెభాగా పోరాటాల ప్రభావంతో వామపక్ష భావాలవైపు ఆకర్షితుడై సన్యాల్ విద్యార్ధి ఉద్యమ నేతగా ఎదిగి కమ్యూనిష్టు పార్టీ నిర్మాణంలోనికి 1950 ఆరంభంలో వచ్చారు.కార్మిక సంఘాల కార్యకలాపాలతో పార్టీలో కొనసాగారు. 1959 నుండి ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీలో ఆదివాసీ రైతు సంఘనాయకుడిగా పనిచేశాడు. 1963లో సిపిఐ (ఎం) వైపు ఉన్నారు.1967 మే 25 న ఉధ్భవించిన నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కానూ సన్యాల్. తెలంగాణా సాయుధ పోరాటంలో విడిచిపెట్టిన - భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం అనే ప్రజాయుధ్ధపంధాలో నడిచాడు.1969 ఏప్రియల్ 22న సి.పి.ఐ. (ఎం.ఎల్) ను ప్రకటించాడు.పార్వతీపురం హత్య కేసులో ముద్దాయిగా అరెష్టయి 6 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. తన మొత్తం రాజకీయ జీవితంలో 14 ఏండ్లకుపైగా జైలు జీవితాన్ని, 7సంవత్సరాలు అజ్ఞాతవాసాన్ని గడిపి 13సంవత్సరాల క్రితం గుండెనొప్పితో అనారోగ్యంపాలయ్యాడు.2సంవత్సరాల క్రితం పక్షవాతంలో బాధపడుతూ 6 నెలలకు పైగా సిలిగురి ఆసుపత్రిలో చికిత్స పొందారు.
కామ్రెడ్.కానూ సన్యాల్ మరణం భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి, మిత అతి వాదాలకు వ్యతిరేకమైన ప్రజా విప్లవ పంధా కు తీరని నష్టం. ఆయన విడిచివెళ్ళిన కర్తవ్యాలను పరిపూర్తి చేయడానికి కృషి చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి.