Saturday, June 27, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 12

సహజ ఎంపిక ఫలితంగా ఒకరకమయిన ‘ సహజ సాంకేతికత ’ ద్వారా వివిధ జీవుల అవయవాలు అభివృద్ధి పొందినట్లు డార్విన్ పేర్కొన్నట్టు మాదిరిగానే మానవుల యొక్క పనిముట్లు, అవయవాలూ, సామాజిక పరిమాణం యొక్క ఉత్పత్తులు గా అభివృద్ధి చెందినవే. మానవుని యొక్క పనిముట్ల అభివృద్ది అనేది , అదే విధంగా ‘ సమానమైన ధ్యాస ’ పెట్టాల్సిన మానవ సమాజ పరిణామం పట్ల వహించాల్సిన వైఖరిని మనకు ఇవ్వట్లేదూ? అటువంటి చరిత్ర (మానవ పరిణామ)ను కూర్చడం అన్నది తేలికైన పనిగా ఉండదూ? ఎందుకంటే వైకో చెబుతున్నట్లు మానవ చరిత్ర ప్రకృతి చరిత్ర నుండి విభేదిస్తుంది. మానవ చరిత్రను మనం తయారు చేశాం. కానీ, ప్రకృతి చరిత్రను మనం తయారు చేయలేదు కనుక! అని మార్క్స్ చరిత్ర పట్ల వహించాల్సిన పరిణామవాద వైఖరిని సూచించారు.

1859 లో డార్విన్ తన ‘ జీవుల పుట్టుక ’ ప్రచురించడం ద్వారా తనయొక్క ‘ సహజ ఎంపిక ద్వారా పరిణామం ’ అన్న సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టే సమయంలోనే ‘ మానవ తెగలను గురించిన శాస్త్రపు అధ్యయన విప్లవకాలం ’ ప్రారంభమయి, ప్రపంచాన్ని గురించిన బైబులు పద్ధతి దృక్కోణంపై దాడి జరిపింది. అతి పురాతన కాలం నుండే భూమిపై మానవులు ఉనికిలో ఉన్నారు అన్న శాస్త్రీయ విజ్ఞాన ఆధారాలు 1856 లో కనుగొనబడ్డాయి. బైబులు భావిస్తున్నట్లు మానవులు కొద్ది వేల సంవత్సరాలుగానే ఉనికిలో ఉన్నారు అన్న అభిప్రాయాన్నిఈ ఆధారాలు నిరాకరించి ఖండించాయి.

ఈలోగా మోర్గాన్ తన మానవ శాస్త్ర అధ్యయనానికి సంబంధించిన ‘ పురాతన సమాజం ’ అన్న రచనను ప్రవేశవెట్టాడు. మార్క్స్ ఈ రచనపై ఆధారపడ్డ తన వైఖరి ద్వారా మానవులయొక్క పూర్తి ఉత్పత్తి , కుటుంబ సంబంధాల అభివృద్ధిని గురించి అవగాహనను రూపొందించుకునే ప్రయత్నం చేశాడు. ఈ రకంగా మతం యొక్క నిర్ణయాధికారపు పరిధి నుండి, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్ణయాధికార పరిధి యొక్క విస్తరణ జరిగింది.

అందువలన మార్క్స్ తన యవ్వన కాలంలో పెట్టుబడిని గురించిన విమర్శనాయుత పరిశీలనను అభివృద్ధి చేయడం కోసం చేసిన ప్రయత్నాన్ని, తనయొక్క మతంపై జరిపిన విమర్శనాత్మక పరిశీలన నుండి ఉద్భవించిన ప్రపంచాన్ని గురించిన మరింత మౌలికమైన భౌతికవాద/ మానవతావాద దృష్టిలో భాగంగా చూడాల్సి ఉంది.

ఇక మరణాన్ని గురించి మార్క్స్ ఈ విధంగా ఎపికారస్ చెప్పిన మాటలను పునరుల్లేఖించినట్లు ఏంగెల్స్ గుర్తుకు తెచ్చుకొని వివరించాడు. ‘ చచిపోయినవాడికి మరణం అనేది ఒక దురదృష్టం కాదు ’ , కానీ బ్రతికున్నవాడికే అది దురదృష్టం. ‘ ప్రపంచం భ్రమల నుండి ప్రత్యేకించి, మతం కల్పించిన దేవుళ్ళ పట్ల భయం నుండి వదిలించుకు బైటపడాలి, ఎందుకంటే ప్రపంచం నా మిత్రుడే కనుక! ’ అంటూ మార్క్స్ బలంగా వాదించాడు. మానవ స్వభావం యొక్క అభివృధ్ధి కొత్త అవసరాలు ఏర్పడటం మొదలైన అన్ని విషయాలతో కూడిన మానవ చరిత్ర అంతా, తమకు తాముగానే దేవుళ్ళ సహాయం లేకుడానే స్వయం మధ్యవర్తిత్వం నెరిపిన ప్రకృతి యొక్క జీవులైన మానవుల ద్వారానే తయారు చేయబడింది, అన్న విషయాన్నిమార్క్స్ ‘ దేవుళ్ళ సహాయం లేకుండానే వస్తువులు(జీవులు) ఉనికిలోకి వచ్చాయి ’ అని ల్యూక్రెటిస్ రాసిన దానిని అదనంగా చేర్చి చెప్పాడు.

( జాన్ బెల్లామీ పాస్టర్, బ్రెట్ క్లార్క, రిచర్డ యార్క్ లు సంయుక్తంగా రాసిన ‘ తెలివైన సృష్టిపై విమర్శనాత్మక పరిశీలన ’ అన్న గ్రంధంలోని అయిదవ అధ్యాయం యొక్క సంగ్రహ సారాంశం ఇది.)

Saturday, June 20, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 11

లక్ష్యాత్మకవాదం యొక్క మరణం:
ప్రకృతి అంతా లక్ష్యాత్మకమైనది అన్నది లక్ష్యాత్మక వాదం యొక్క సారాంశం. అంతిమ లక్ష్యమే యదార్ధాన్ని (ప్రకృతి యొక్క) నిర్దేశిస్తుంది అని ఈ వాదం భావిస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రాసికి ప్రకృతి యొక్క భౌతిక అవగాహన, చారిత్రిక భౌతికవాద అవగాహనలు వదిలివేయరాని, అత్యావస్యకమైన పునాదులు అన్నది మార్క్స్ యొక్క నిశ్ఛితాభిప్రాయం. మానవ చరిత్ర, ప్రకృతి చరిత్ర అంతిమంగా ఒకే చారిత్రిక చట్టం క్రిందికి వస్తాయి. అందువలనే ఆయన ఒక దేవుని యొక్క పధకం ప్రకారం జరిగిన సృష్టి అన్న అన్ని రకాల భావనలకూ వ్యతిరేకంగా ఆయన పరిణామవాద దృక్ఫధాన్ని నిలకడగా ముందుకు తీసుకువెళ్ళాడు. ఒకరకమైన ఆకస్మక, యాదృచ్చిక ఉత్పాదనానికి అనుగుణంగా ఈ ప్రపంచంలో ‘ ప్రాణం ’ ఆవిర్భవించిందని ఆయన దృఢంగా వాదించాడు. ఆయన ఏంగెల్స్ తో కలిసి జీవసంబంధమైన ఉనికిని గురించి లక్ష్యాత్మకవాద అంశాల పరిధిలో అర్ధం చేసుకోలేము అనీ ‘ జంతువులకూ, మొక్కలకూ మధ్యగల తీవ్రమైన పోటీ ’ అన్న అంశంలో జీవ రూపాల ఉనికి ముడిపడి ఉందనీ అటువంటి పోటీలోనే తెగలకు (జీవులకు) ప్రకృతికీ చెందిన సహజ పరిస్థితులకూ గల సంబంధం యొక్క భౌతిక కారణం ఉందనీ ఆయన వాదించాడు. చారిత్రిక భూగర్భ శాస్త్రాల నుండి పుట్టుకొచ్చిన ‘లోతైన కాలం’ అన్న అవగాహనను ఆయన ముందునుండీ అనుసరించాడు.
మార్క్స్ డార్విన్ యొక్క పరిణామవాద సిద్ధాంతాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. డార్విన్ యొక్క ’ జీవుల పుట్టుక ‘ గ్రంధాన్ని చదివిన అనంతరం మార్క్స్ ఫెర్డినాండ్ లూసే కు ఉత్తరం రాస్తూ ‘ మొట్టమొదటి సారి ఈ గ్రంధంలో ప్రకృతి శాస్త్రంలో లక్ష్యాత్మక వాదానికి చావుదెబ్బ కొట్టడం జరిగింది. దానియొక్క హేతుబద్ధమైన అర్ధాన్ని అనుభవవాదం ద్వారా వివరించడం జరిగింది ’ అని పెర్కొన్నాడు. అయితే డార్విన్ మాల్తూస్ ను స్పూర్తిగా తీసుకొని తన ‘ సహజ ఎంపిక ’ సిద్ధాంతాన్ని అభివృద్ధిచేయడం వలన ‘ క్రైస్తవ మత నైతికత ’ ప్రకృతి మత ధర్మశాస్త్రాలను, వర్గాలూ-ఆస్తిని విభజించే బూర్జువా సమర్ధనలనూ సమాదరించిన మాల్తూస్ సిద్ధాంతానికి, అనుకోకుండా డార్విన్ సామాజిక రంగంలో అర్హత కల్పించాడనీ, మార్క్స్ ఆయన్ని విమర్శించాడు. అందువల్లనే మార్క్స్ , ఏంగెల్స్ లు మానవజాతి స్వేశ్ఛను మరింత పెంపొందించడం కోసం భౌతికవాద/ మానవతావాద శాస్త్ర విజ్ఞానానికి కట్టుబడి వుంటూ అన్ని సందర్భాలలోనూ డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని మాల్తూస్ సిద్ధాంతం లేదా సామాజిక డార్వినిజం అన్న సిద్ధాంతాలనుండి వేరుచేసి విడిగా చేయాలని కోరుకున్నారు. వర్గసంబంధాలను సమర్ధించేందుకు ఉద్దేశింపబడిన మాల్తూస్ యొక్క నైరూప్య జనాభా సిద్ధాంతం యొక్క స్థానంలో , మానవ జనాభా యొక్క అభివృద్ధిని, సమాజాల అభివృద్ధిని గురించి వాటికి సంబంధించిన అన్ని కోణాలను గురించి ఒక చారిత్రక, భౌతికవాద, శాస్త్రీయ అవగాహనను అభివృద్ది చేయడం కోసం మార్క్స్ ఎక్కువ మేరకు మానవతా జాతి ఉద్భవం , వారి నడవడిక సాంప్రదాయాల అధ్యయనం జరిపే నూతన శాస్త్రమయిన మానవ శాస్త్రం వైపుకు ప్రధానంగా తన దృష్టిని మళ్ళించాడు.

Saturday, June 13, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 10

జనాభా సిద్ధాంతాన్ని రాసిన మాల్థూస్, తనకు ముందున్న టౌన్ సెండ్ మాదిరిగానే ‘ పురోహిత మత మౌఢ్యపు’ నేరాన్ని చేసిన నేరస్తుడు. మాల్థూస్ యొక్క సిద్ధాంతాలు శాస్త్రీయమైనవిగా చూపెట్టబడినా ‘ పేదలకు సంబంధించిన చట్టాలు’ తొలగింపబడటాన్ని సమర్ధించడానికి మాల్థూస్ దేవుడ్ని అంతిమ కారణంగానూ, దైవేచ్ఛ మతపర నైతికతను దైవ సాక్ష్యాలుగానూ ముందుకు తీసుకు వచ్చాడు. అందువల్లనే ప్రగతిశీల రాజకీయవాది అయిన విలియం కొబెట్ మాల్థూస్ ను గురించి మార్క్స్ చెప్పిన ఉద్దేశ్యంలోనే ఇలాగన్నాడు:
‘ నేను నా జీవితకాలంలో అనేకమందిపట్ల నా అయిష్టతనూ, యావగింపునూ ప్రదర్శించాను. కానీ వారిలో నీయంతటి రోసిపోయిన వాడెవ్వడూ లేడు....... నీ గురించి ఎన్ని పదబంధాలు చెప్పినా , సరైన వర్ణనను ఇవ్వలేవు. అందువలన నీ గుణగణాలను ఒక్క పదమే సక్రమంగా వర్ణించగలుగుతుంది. అందుకే నిన్ను ‘ పురోహితుడు ’ అని పిలుస్తాను. ఈ పదానికి ఉన్న అనేక అర్ధాలతోపాటు ‘ పట్టణంలో వ్యాపారం చేసేవాళ్ళ చేతిలో పనిముట్టు’ అనే అర్ధం కూడా ఉంది ’ అంటూ మాట్లాడి మాల్థూస్ పట్ల కార్మికవర్గానికి గల ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు.
మాల్థూసియన్ సిద్ధాంతం మతతత్వ పిడివాదం యొక్క ఆత్మకూ – ప్రకృతికీ మధ్య గల వైరుధ్యం , తత్ఫలితంగా అవినీతి పాలైన ఆత్మ ప్రకృతి లకు చెందిన ఆర్ధికవాద వ్యక్తీకరణ – అని ఏంగెల్స్ 1844లో రాశాడు.’ క్రైస్తవ మతం యొక్క ఆశయంగా ’ ఆకలి ’ స్తానంలో దానికి అనుబంధంగా ‘ భయాన్ని’ ఉంచడం ద్వారా బూర్జువా పరిశ్రమకు ఆశయంగా ‘ ఆకలి ’ అనుబంధంగా ఉంచబడింది. ‘ఆరకంగా ఇది దేముడి యొక్క పథకానికీ , సహజ ధర్మానికి ఋజువుగా చెప్పబడింది. ‘ ఆకలి శాంతియుతమైన ’ మౌనంగా ఉండే ఎడతెగని వత్తిడి మాత్రమేకాదు, అది పరిశ్రమకూ , కార్మికశక్తికీ చాలా మేరకు చలనశక్తిగా ఉంది. అది అత్యంత శక్తివంతమైన సంఘర్షణకు దారితీస్తుంది.’ అని జోసఫ్ టేన్ సెండ్ 1786లో వెల్లడించిన అంశాలను కార్ల్ మార్క్స్ గుర్తు పెట్టుకున్నాడు.

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 9

ముందుగా మార్క్స్ మతంపై చేసిన విమర్శనాయుత పరిశీలన , ఊహాపూర్వక తత్వశాస్త్రం, తర్వాతి కాలంలో ఆయన బూర్జువా సమాజపు సిద్ధాంతంపై చేసిన విమర్శనాత్మక పరిశీలనకు ప్రాతిపదిక అయింది. ‘ మేధస్సును మత దర్శీకరణ చేయడం ’ అన్న రచనలో మార్క్స్ తాను బలీయంగా వ్యక్తం చేసిన భావనలు ,ప్రబలంగా ఉన్న భౌతిక సంబంధాలకు సంబంధించిన , ప్రబలంగావున్న భౌతికసంబంధాలనుండి గ్రహించిన భావనల ఆదర్శ వ్యక్తీకరణ తప్ప మరొకటి కాదు అని తెలియజేశాడు.
జర్మనీ దేశ సందర్భంగా ప్రస్తావిస్తూ ప్రొటెస్టెంట్ సంస్కరణల్లో ప్రత్యేకించి లూథరినిజం అన్నది ఎదుగుతూ ఉన్న బూర్జువా సమాజానికి తొడిగిన సరికొత్త మతపరమైన దుస్తులుగా మార్క్స్ తరుచూ పేర్కొనేవాడు.ఆ రకంగా ఆయన వ్యంగ్యంగా మార్టీన్ లూథర్ యొక్క వాదనల్లో పేర్కొన్న దోపిడి ప్రపంచపు ఉనికిని, దేముడియొక్క పథకరచనకు సాక్ష్యంగా చెప్పేవాడు. ఈ రకంగా మార్క్స్ అటు మతం పైన ఇటు పెట్టుబడి పైనా అనంతంగా విమర్శనాత్మక పరిశీలన జరిపాడు.
మార్క్స్ సూటిగానే, నేరుగా మతంతో తలపడ్డాడు. ఎందుకంటే ఆది (మతం) నైతికత, శాస్త్ర విజ్ఞానశాస్త్రాల రాజ్యం లోకి చొరబడింది. కనుక నైతిక అనేదాన్ని పునాదివాదపు లేదా సాపేక్షతావాద అంశాల పరిధుల్లో నిర్ణయించ వీలులేదు. నైతికతను మానవ సమూహాల భౌతిక అవసరాలతో పుట్టుకొచ్చిన నైతిక పరిస్థితులపై ఆధారపడ్డ విప్లవ చారిత్రాత్మక వాదపు అంశాలపై ఆధారపడి నిర్ణయించాలి. అందువల్లనే మార్క్స్ ‘ మార్మిక వైఖరి, దైవకృత లక్ష్యం, దైవం ’ లాంటి భావాలపై దాడి చేశాడు. మతం యొక్క అంతిమ కారణం నుండి పుట్టుకొచ్చే అన్ని పునాది వాదపు నైతికతనూ తిరస్కరించాడు. ఆయన మానవులే ‘ తమయొక్క స్వంత నాటకం యొక్క రచయితలూ, నటులూ ’ అని నొక్కి చెప్పాడు.
సంకుచితమైన మతపరమైన నైతికతను , రాజకీయ అర్ధశాస్త్రపు అభివృద్ధిపై మతపర నైతికతయొక్క ప్రభావాన్ని తెగనాడుతూ మార్క్స్ తన పెట్టుబడి గ్రంథంలో జనాభాను గురించిన సిద్ధంత కర్తల్లో ఎక్కువమంది ప్రొటంస్టెంట్ పురోహితులే. .... (రాజకీయ ఆర్ధిక శాస్త్రంలోకి ) జనాభా సిద్ధాంతం ప్రవేశించటంతోటే , ప్రొటెస్టెంట్ పురోహితుల సమయం మొదలయిందని పేర్కొన్నాడు. ఇటువంటి ఆలోచనాపరులు శాస్త్రవిజ్ఞానంనుండి వైదొలిగి , పాలకవర్గ సామాజిక వ్యవస్థను సమర్ధించడం కోసం, ప్రాకృతిక మత ధర్మశాస్త్రపు, మత నైతికత్వపు వాదనలను శాస్త్ర విజ్ఞాన రంగంలోనూ , రాజకీయ ఆర్ధికశాస్త్ర రంగంలోనూ అనుమతిస్తారనీ, మార్క్స్ వీరి ప్రవేశానికి (రాజకీయ ఆర్ధిక శాస్త్రరంగం లో) తన ప్రధాన అభ్యంతరాన్ని తెలియజేశాడు.

Thursday, June 11, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 8

అందువలన మతం పట్ల మార్క్స్ యొక్క విమర్శనాత్మక పరిశీలన దేముడియొక్క ప్రకృతి అతీత ఉనికిని గురించికానీ అటువంటి ఉనికి లేదని చెప్పడం గురించి కాని కానేకాదు. కానీ ఈ భౌతిక ప్రపంచం గురించీ, మానవులున్న ఈ ప్రపంచం గురించి , హేతువూ- శాస్త్రవిజ్ఞానం గురించి రూఢిగా చెప్పడం గురించి ఆయన విమర్శనాత్మక పరిశీలన జరిగింది. ఇవన్నీ మానవుడు మతాన్ని ఒక మధ్యవర్తి ద్వారా వక్రమార్గాన గుర్తించడాన్ని వ్యతిరేకించి మతాన్ని స్థానభ్రంశం చేయడానికి అవసరమవుతాయి. అందువల్లనే థామస్ డీన్ మార్క్స్ యొక్క విమర్శనాత్మక పరిశీలన ( మతాన్ని గురించి ) ను గురించి సరిగ్గానే ఈ విధంగా రాశాడు. మార్క్స్ నాస్తిక వాదాన్ని కేవలం మతాన్ని ఒక సిద్ధాంతంగా మాత్రమే పరిగణించిందని భావించాడు. అందువలన నాస్తికవాదం మతవిధమైన ఆలోచనా విధానానికి సమూలమైన విప్లవాత్మక ఛేదనం చేయటానికి దారితీయదు. నాస్తికవాదం ఎక్కువగా ఆస్తికవాదానికి అంతిమ దశగా , భగవంతుని యొక్క వ్యతిరేక గుర్తింపు గా కనిపిస్తుంది తప్ప మానవుని యొక్క ఈ లౌకిక ప్రపంచపు తత్వశాస్త్రపు అనుకూల సిద్ధాంత పునాదిగా కనిపించదు. అది దేముణ్ణి స్తానభ్రష్టుణ్ణిగా చేయాలనే వాంఛను అనివార్యంగా పెంచుతుంది. ఈ రకంగా నాస్తికవాదం ఆమేరకు మానవుని ఉన్నత స్థాయిలో లేదా దైవీకరణ చేసిన స్థాయిలో ఉంచే అవగాహనను నిరాకరిస్తుంది. ..... ఇది కేవలం , మానవత్వ వాదాన్ని నాస్తిక వాదం గుండా అతీంద్రియ వాదపు మధ్యవర్తిత్వం నెరిపే , అతీంద్రియ భావవాదం అని భావించరాదు.
సాధ్యమయ్యే అవకాశం ఏర్పడడం కోసం ఒక అవసరమైన మార్క్స్ యొక్క నాస్తికవాదం ఒక - సానుకూల మానవతావాదం తననుండి తానే పుట్టుకువచ్చే మానవతావాదం సాధ్యం అవటానికి ఏర్పడే అవకాశానికి ఇది ఒక అవసరమైన , ముందుగా అనుకొన్నఆలోచన - అందువలన మార్క్స్ యొక్క నాస్తికవాదం ఆయన యొక్క లౌకిక అనుభవవాదం అన్నవి భగవంతుడి ఉనికిని కాదని నిరూపించే ఊహలు కానీ, సైద్ధాంతిక వాదనలు కానీ కావు. అటువంటివి అయితే అవి మత ధర్మశాస్త్ర గుణాలుగల మతధర్మశాస్త్రమే అయిన దానియొక్క సైద్ధాంతిక పునాది అవుతాయి. కానీ మార్క్స్ యొక్క నాస్తికవాదం తాను తక్షణంగా ఎటువంటి మధ్యవర్తి లేకుండా తన స్వంతకాళ్ళపైన నిలబడగలిగే విధంగా స్వతంత్రంగా రూపొందిచబడిన మానవతావాదం.
మార్క్స్ యొక్క గతితార్కికవైఖరి ‘ నిజమైన ఆనందం ’ అసాధ్యం అవటం వలన ఏర్పడిన అవసరానికనుగుణంగా కల్పించబడిన భ్రమాపూర్వక ఆనందానికి ఉత్పత్తి స్తానంగా మతాన్ని భావించింది. అందువలన ఆయన మతాన్ని – హృదయంలేని ప్రపంచం యొక్క హృదయంగా – పేర్కొనగలగడమే కాక మనం ‘ క్రైస్తవ మతాన్ని చాలావరకు క్షమించ వచ్చు. ఎందుకంటే అది మనకు శిశువుని పూజించడాన్ని నేర్పింది’ అని చెప్పగలిగాడు. అందువలన మతం యొక్క విమర్శనాత్మక పరిశీలన అనేది నైరూప్య నాస్తిక వాదం. ధ్యాన , భౌతిక వాదాలను మించి విప్లవ ఆచరణలో వేళ్ళూనుకుని ఉన్న నేలపై నాస్తికవాదం తలెత్తగలితే అది ఆమేరకు అర్ధవంతమైనదవుతుందని మార్క్స్ రాశాడు.