2010 ఏప్రిల్ లో షోపియాన్ గ్రామంలోని ఇద్దరు మహిళల మృతదేహాలు నదిలో తేలుతూ కనిపించడంతో కాశ్మీర్ లో ఈ నిరసన వెల్లువ మొదలైంది. సాయుధ పోలీసులు ఆ మహిళలపై అత్యాచారం చేసి , చంపి, ఆశవాలను నదిలో పారవేశారని తెలుసుకున్న ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమాయకులైన యువకులను పోలీసులు చంపడం, దానికి నిరసనగా ప్రజలు వీధులలోకి రావడం, పోలీసులు మరికొంతమందిని కాల్చివేయడం , ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వీధులలోకిరావడం అనేది అంతులేకుండా సాగుతుంది. కొన్ని నిర్ధిష్ఠ నేరాలపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు క్రమంగా కాశ్మీర్ అంతటా వ్యాపించి , సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాలను రద్దు చేయవలసినదిగానూ, సి.ఆర్.పి.ఎఫ్. దళాలను కాశ్మీరునుండి పంపి వేయాలని డిమాండ్ కొనసాగుతుంది. ఈ ఉద్యమం కాశ్మీరు ప్రజల స్వాతంత్ర్య పిపాసను తెలియజేస్తుంది.
మొదటగా ఇది ప్రజలలోని అన్ని వయసులవారినీ ఆకర్షించింది. యువకులు కీలకపాత్ర వహిస్తున్నారు. ఈ నిరసనలు రాజకీయ ఉద్యమ రూపంలో ఉంటున్నాయి. కర్ఫ్యూలను, బులెట్లను, నిర్భంధాలను ఎదిరిస్తూ ప్రజలు పోరాడుతున్నారు. ఇది తిరుగుబాటు స్వభావంతో ఉంది. గతంలో పోలీసులు ప్రజల ఇళ్ళపై దాడిచేసి , యువకులను తీసుకెళ్ళి కాల్చి చంపి, టెర్రరిష్టులు ఎన్ కౌంటర్ లో మరణంచారని ప్రకటించేవారు. కాని ఇప్పుడు ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా వేలసంఖ్యలో వీధులలోకి వస్తుండడం వల్ల పాత పధ్థ్ధతిలో కాల్చివేయడం పోలీసులకు సాధ్యపడడంలేదు.