Saturday, April 4, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 3

ఆ తర్వాత 1837 నవంబరులో బెర్లిన్ నుండి కార్ల్ మార్క్స్ తన తండ్రికి రాసిన ఉత్తరం పేర్కొన దగినది. ఈ ఉత్తరంలో ఆయన ఇప్పటికే పూర్తిగా జీర్నించుకున్న హెగెల్ తత్వంలోని “ విలక్షణమైన ఎగుడు దిగుడు శ్రావ్యత ” ను గురించి సంఘర్షణ పడడాన్ని , హెగెల్ విధానములోని భావవాదపు సారాంశాన్ని ప్రతిఘటించడాన్ని మనం గమనిస్తాం. “ గతంలో దేముళ్ళు భూమికి పైన ఉన్న లోకాల్లో నివసిన్తే , ఇప్పుడు ( హెగేల్ తత్వప్రకారం) భూమి వారి నివాస కేంద్రమైంది. ” అంటూ వ్రాశాడు. ఆరకంగా హెగేల్ తత్వం ‘ వాస్తవంలో నుండి భావాన్ని వెతుకుతుంది ’ అంటూ తనపై హెగేల్ భావం పూర్తిగా ప్రభావం కలిగియున్నప్పటికీ తాను అటువంటి భావంనుండి ‘ తన శత్రువు యొక్క బాహువుల్లోకి ’ అందించబడ్డాననీ, తాను ‘ అసహ్యించుకునే అభిప్రాయం యొక్క విగ్రహాన్నితయారు చేశాననీ ’ ఆ ఉత్తరంలో ఆయన రాశారు. అయితే ఆయన అదే సమయంలో యువ హెగేలియన్ల ‘ డాక్టర్స్’ క్లబ్బులో కూడా చేరాడు. అందులో హెగెల్ యొక్క తత్వాన్ని గురించి , మతాన్ని గురించిన విమర్శనాయుత పరిశీలన గురించే అనంతమైన చర్చలు జరిపాడు.
హెగేలియన్ తత్వం పై పడే సంఘర్షణల మధ్యలో మార్క్స్ ‘ అనుకూల అధ్యయనం ’ వైపు మళ్ళాడు. ప్రాన్సీస్ బేకన్ యొక్క జర్మనీకి చెందిన ప్రకృతి మత శాస్త్రవేత్త అయిన హెర్మన్ శామ్యూల్ రీమారస్ ల యొక్క రచనలను ఆయనపరిశీలించాడు. మార్క్స్ ఆలోచనపై బేకన్ యొక్క ప్రభావం చాలాకాలం పాటు ఉన్నదన్నది నిస్సందేహం. మార్క్స్ బేకన్ ను పూర్వకాలపు అణువాదులైన డెమోక్రటిస్ , ఎపిక్యూరస్ లకు ఆధునిక కాలపు భౌతికవాద ప్రతిరూపంగా పరిగణించాడు. 1830 దశకం చివరిలోనూ , 1940 దశకం మొదటి కాలం లోనూ , ఇంచుమించు ఒకే కాలంలో మార్క్స్ ,డార్విన్లు ఇద్దరూ బేకన్ యొక్క లక్ష్యాత్మకవాద వ్యతిరేక దృక్పధాన్ని సొంతంగా ఆమోదించి, అనుసరించారు. బేకన్‌యొక్క దృక్పథం , పూర్వకాలపు భౌతిక వాదుల భావంనుండి సంతరించకొన్నది. ‘ ప్రకృతి యొక్క మూలం అంతిమ కారణంలో ఉంది ’ అని భావించే ఏ అవగాహన అయినా ‘ భగవంతునికి దత్తం చేయబడ్డ కన్య ఏరకంగా పిల్లల్ని కనలేని గొడ్డుమోతురాలో , అటువంటి గొడ్డుమోతుది ’ అన్నదే పూర్వకాలపు భౌతికవాదుల దృక్పథం.
ఈ విధంగా వేల సంవత్సరాల కాలంగా , ప్రకృతికి భాష్యం చెప్పటం కోసం భౌతికవాదానికీ, భావవాదానికీ మధ్యా, విజ్ఞానశాస్త్రానికీ, భగవద్‌సృష్టివాదానికీ మధ్యా జరుగుతున్న మహత్తర సంఘర్షణ, బేకన్ యొక్క ఆలోచన ద్వారా , చిన్న వయసు లోనే మార్క్స్‌పై తన ముద్రను వేసింది. ఏంగెల్స్ చెప్పినట్లు 18వ శతాబ్దపు ప్రబోధాత్మక జ్ఞానోదయం “ క్రైస్తవ దేవుడికి బదులు మానవుడు ఎదుర్కొని ఘర్షణ పడాల్సిన సంపూర్ణ విషయంగా ప్రకృతిని అతడి ముందు నిలబెట్టింది. ” ఆవిధంగా ‘ పధకం ప్రకారం సృష్టి ’ ‘ లక్ష్యాత్మక వాదంపై ’ ఆధారపడ్డ ఇతర భావవాదపు వాదాలన్నిటి వాదాల తర్కంలోంచీ భౌతిక వాదం ఉద్భవించింది. ఈవిషయాన్నే ఏంగెల్స్ నిర్ణాయకంగా ఇలా చెప్పారు. “ దేముడు ప్రపంచాన్ని సృష్టించాడా ? లేక ప్రపంచం నిత్యమై శాశ్వితంగా ఉందా ? ”. ఈ ప్రశ్నకు జవాబులిచ్చిన తత్వవేత్తలు రెండు మహా శిబిరాలుగా విడిపోయారు. ఏదోఒక రూపంలో ప్రకృతికి ముందుగానే ప్రాణం ఉనికిలో ఉందనీ స్థిరంగా చెప్పే ( ఇటువంటి తత్వవేత్తల్లో ఒకరు హెగెల్. ఉదాహరణకు క్రిష్టియానిటీ చెప్పినదానికన్నా ఈ సృష్టి తరచుగా మరింత సంక్లిష్టమైంది, అసాధ్యమైనదిగా మారిపోతుంది అన్నభావం ) వారందరితో కూడి – భావవాద శిబిరంగా ఏర్ఫడింది. ప్రకృతే ముందుగా ఉనికిలో ఉందని పరిగణించే వివిధ తరహాల తత్వవేత్తలందరితో కూడి మరో శిబిరం – భౌతికవాద శిబిరం ఏర్పడింది. భావవాదం, భౌతికవాదం అన్న ఈ రెండు భావ వ్యక్తీకరణలు ప్రధానంగా ఇంతకు మించిన విషయాన్నీ, భావాన్నీ వ్యక్తం చెయ్యవు. అందువలన ఈ భావ వ్యక్తీకరణను ఇంతకు మించిన అర్ధంలో ఇక్కడ ఉపయోగించలేదు.

No comments: