Monday, April 6, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 5

అది ఆకస్మికతే. దాన్నే తప్పనిసరిగా అంగీకరించాలి- జనబాహుళ్యం నమ్ముతున్నట్లు దేవుడుకాదు...... పేదరికంలో నివసించడం అన్నది దురదృష్టం. కానీ పేదరికంలో జీవించడం అన్నది ఒక అవసరం కాదు. అన్ని వైపులా స్వాతంత్యానికి తేలిక అయిన దగ్గరి మార్గాలు తెరిచివున్నాయి. ....పేదరికాన్నే ( అవసరాన్నే) లొంగదీసుకోవడం అన్నది అనుమతించబడింది ‘ అన్న ఎపిక్యురస్ చెప్పిన అభిప్రాయాలు కార్ల్ మార్క్స్‌ ను ఆ అభిప్రాయాల వైపు మరింత దగ్గరగా ఆకర్షించాయి. ‘ గ్రీకు సారస్వత తత్వశాస్త్రం యొక్క ఆఖరి రూపాలు – ప్రత్యేకించి ఎపికరియన్ తత్వరూపాలు – నాస్తిక, భౌతికవాదానికి దారితీస్తే, గ్రీకు మోటు తత్వశాస్త్రం ఒకే ఒక దేముడు, మానవుని ఆత్మ యొక్క మరణం లేని నిత్యత్వ సిద్ధాంతానికి దారితీసింది ’ అని తదనంతరకాలంలో ఏంగెల్స్ రాశారు. మార్క్స్ తన డాక్టరేట్ చర్చా వ్యాసాన్ని , థీసిస్ గా ప్రకటించేటప్పుడు దానికి ముందు మాటలు ఎపిక్యూరిస్, ప్రొమేథియస్ లను జ్ఞానకాంతి తెచ్చినవారిగా గుర్తిస్తూ ‘ సాదా మాటల్లో చెప్పాలంటే నేను ఆదేముళ్ళ మూకను అసహ్యించుకుంటాను ’ అని ప్రొమేథియస్ తన అభిప్రాయాన్ని ఒప్పుకోవడం అన్నది, తత్వశాస్త్రం యొక్క స్వయాంగీకారం అనీ, అది మానవుని ఆత్మ చైతన్యాన్ని అత్యున్నతమైన దైవత్వంగా అంగీకరించని స్వర్గంలోని , నరకం లోని దేముళ్ళందరికీ వ్యతిరేకంగా తత్వశాస్త్రం యొక్క స్వయంగా చేసిన క్లుప్తమైన సూత్రీకరణ అని రాశారు.
మార్క్స్ తన డాక్టరేట్ కోసం వ్రాసిన చర్చా వ్యాసానికి అనుబంధంగా ఎపిక్యురస్‌కి వ్యతిరేకంగా ఫ్లూటార్ష్ రాసిన వివాదాస్పద వ్యాసంపై తన విమర్శనాత్మక పరిశీలనా వ్యాసాన్ని కూడా చేర్చాడు. ఈ విమర్శనాత్మక పరిశీలన ఒక ప్రత్యేక తరహాకు చెందినది. ఇది మేధస్సును మతధర్మశాస్త్రీకరించడానికి, తత్వశాస్త్రానికీ గల సంబంధం గురించి బలంగా చెప్పింది. ఎపిక్యురస్‌కు వ్యతిరేకంగా రాసిన వివాదాస్పద చర్చా వ్యాసం ద్వారా ఫ్లూటార్ష్ మతనైతికతనూ, తెలివైనసృష్టి వాదాన్ని ముందుకు తీసుకుపోవాలని చేసిన ప్రయత్నంలో ఆయన తత్వశాస్త్రాన్ని మతవేదికకు ముందున పెట్టాడు. మార్క్స్ , డేవిడ్‌హ్యూం పక్షం వహిస్తూ ప్రకృతి పట్ల హేతుబద్ధ వైఖరి గల తత్వశాస్త్రమే విజ్ఞానశాస్త్రానికి హక్కుదారైన రాజు అనీ, సహజమత ధర్మశాస్త్రం యొక్క శాస్త్రీకరింపబడిన మేధస్సు కాదని మార్క్స్ ప్రకటించాడు.
భగవంతుడిపట్ల ఉండాల్సిన అవసరమైన భయాన్ని తొలగించినందుకు గాను ఎపిక్యూరస్‌ను ఫ్లూటార్ష్ తీవ్రంగా విమర్శించాడు. అన్నిటికన్నా మరణానంతరం భయం అన్నది మానవులను భగవంతునికి కట్టిపడేసింది. అందుకే మార్క్స్ ఫ్లూటార్ష్ ను గురించి చెబుతూ అతడు, ‘ ఇంద్రియ సంబంధమైన చైతన్యానికి అధోలోకంలో సంభవించబోయే భయంకరమైన విషయాలను సమర్ధించే.................. భయంలో, నిర్దిష్టంగా అంతర్గతంగా ( మానవునిలో ) ఉన్న భయాన్ని ఆర్పజాలమనీ సమర్ధించే , సిద్ధాంతాలనూ వెల్లడించే ప్రతినిధి అనీ , ఈ సిద్ధాంతాలు మనిషిని ఒక జంతువుగా నిర్ణయించాయనీ ’ మార్క్స్ తన పరిశీలనలో పేర్కొన్నాడు.
ఫ్లూటార్ష్ యొక్క దేముడు , మార్క్స్ కు ‘ దిగజారిపోయిన దేముడు ’ . ఫ్లూటార్ష్ స్వయంగా ‘ సామాన్య ప్రజానీకం యొక్క నరకాన్ని’ గురించి బోధించే ప్రతినిధి. మార్క్స్ తన పరిశీలనలో ఫ్రెంచ్ భౌతికవాదీ, ఎపిక్యూరియన్ తత్వవేత్త అయిన డీహోలబాష్ యొక్క ‘ ప్రకృతి వ్యవస్థ ’ అన్న రచనలో చెప్పిన ఈ వ్యాఖ్యానాలను పేర్కొంటాడు. ‘ ప్రకృతిని మించిన అతీత శక్తి ఒకటి ఉందని, ఆ అతీత శక్తి ముందు హేతు, తర్కాలు మౌనంగా పడివుండాలనీ, ఆ అతీత శక్తి ముందు మనిషి తనకున్నదంతా త్యాగం చెయ్యడం ద్వారా ఆనందాన్ని పొందాలనీ , మానవులకు బోధించి అంగీకరింప చెయ్యడాన్ని మించిన ప్రమాదం మరొకటి లేదు. ’
‘ హేతు తత్వం లేకపోవడం వలన దేముడు ఉనికిలో ఉన్నాడు ’ అనీ, దేముడున్నాడు అని చూపించే ఆధారాలనబడేవాటన్నిటినీ మార్క్స్ కొట్టిపారవేశాడు.
ఈ చర్చావ్యాసంలో మార్క్స్ తనను హెగెల్ అభిప్రాయాలనుండి విడగొట్టుకున్నాడు. మార్క్స్ , ఏంగెల్స్‌లు తమ ‘ పరిత్ర కుటుంబం ’ అన్న రచనలో హెగెల్ యొక్క తత్వం ‘ ఆత్మకు - పదార్ధానికి , దేముడికీ – ప్రపంచానికి మధ్య గల విరుద్ధాంశాలను గురించిన జర్మన్ క్రిష్టియన్ పిడివాదం యొక్క ఊహాకల్పన యొక్క వ్యక్తీకరణ ’ అని తెలియ జేశాడు.
హెగెల్ యొక్క తర్కానికి మార్క్స్ ‘ పవిత్ర గృహం ’ అనే పేరు పెట్టాడు. వాన్‌లువీన్ ఎత్తిచూపినట్లు హెగెల్ యొక్క ఈ ‘ పవిత్ర గృహం ’ అన్నది మాడ్రిడ్ లోని రోమన్ కథోలిక్ మతగురువుల న్యాయసభ ‘ తమయొక్క కారాగారానికి పావనత్వం కలిగించి ’, ‘ భీభత్స గృహానికి ’ పవిత్రతను ఆపాదించినట్లుందని , మార్క్స్ తన ‘ హెగెల్ విమర్శనాత్మక పరిశీలన ’ లో పేర్కొన్నాడు. లుడ్విగ్ ఫాయర్‌బా యొక్క మతాన్ని గురించిన విమర్శనాత్మక పరిశీలన ప్రక్కప్రక్కనే మతంపై మార్క్స్ యొక్క స్వతంత్ర విమర్శనాత్మక పరిశీలన కూడా అభివృద్ధి చెందింది. హెగెల్ యొక్క ఆదర్శవాద తత్వాన్ని లుడ్విగ్ ఫాయిర్‌బా నిరాకరించిన విషయం మార్క్స్ పై గట్టి ప్రభావాన్ని పడేసింది.

No comments: