Sunday, June 22, 2008

గ్యాసుకు 50 రూపాయలివ్వడం ఉత్త గ్యాసేనా?

పెట్రోలును లీటరుకు 5 రూపాయలూ, డీజిలు 3 రూపాయలూ, గ్యాసు సిలెండరును 50 రూపాయలు పెంచింది. పెట్రోలు, డీజిలు పై ఎక్సైజు సుంకాన్ని 1 రూపాయి , దిగుమతులపై కష్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించింది. ప్రజలపై 45,000 కోట్ల రూపాయల భారం మోపింది. ఫలితంగా ద్రవ్యోల్బణం 11 శాతానికి పెరిగింది , అంటే ధరలు బాగా పెరిగాయి.
ధరలు తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వాలు తమ అమ్మకం పన్నును తగ్గించుకోవాలని కేంద్రం కోరింది. పెంచిన ధరలు తామే భరించి , పాత ధరలకే అమ్ముతామంటూ ప్రకటించారు. ఇది అసలు విషయాన్ని తిరగేసి చెప్పటమే. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాల అమ్మకం పన్ను 20-30 శాతం వరకూ ఉంది. దినివల్ల రాష్ట్రాలకు 37,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నే తీసుకుంటే కేంద్రం పన్ను తగ్గించినందువల్ల 600 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. అంతకు ముందు 1800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కాగా ధరలు పెరిగినందున పన్నురేటు తగ్గించినా , అమ్మకం పన్ను నుండి ఆదాయం 425 కోట్ల రూపాయలు పెరుగుతుంది. అంటే ఆదాయంలో తగ్గుదల 175 కోట్ల రూపాయలు మాత్రమే. ముఖ్యమంత్రి - పెంచిన గ్యాసు ధర 50 రూపాయలూ పెంచకుండా , పాతధరకే అమ్ముతానని - ప్రకటించాడు. దీనివల్ల అదనంగా రావలసిన అమ్మకం పన్ను ఆదాయాన్ని మాత్రం కోల్పోతాడు తప్ప, తాను నష్టపోయేదో, తాను భరించేదో ఏమీలేదు. ప్రజలంటే మరీ అంత అమాయకంగా కన్పిస్తారా పాలకులకు ?

No comments: