Saturday, April 14, 2007

కేంద్ర బడ్జెట్టు దోపిడీ వర్గాలకు పెద్ద పీట

2007-08 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్టులో మంత్రి చిదంబరం చెప్పిన దానికంటే చెప్పకుండాఊరకున్నదే ఎక్కువగావుంది.2006-07 సంవత్సరపు ఆదాయ వ్యయాలూ, వాస్తవలోటు లను పేర్కొనలేదు. ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే అంశాలివి. ప్రణాళికా వ్యయం 205000 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 435421 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటాల కొనుగోలుకు 40000కోట్లు. మొత్తం వ్యయం 680521 కోట్లు. రెవెన్యూ ఆదాయం 486422 కోట్లు, రెవెన్యూ వ్యయం 557000 కోట్లు వెరసి 71478 కోట్లు లోటు గా చూపించారు. అయితే రెవెన్యూ ఆదాయానికి వాస్తవఖర్చుకు మధ్యనున్న 194099 కొట్లకు సంబంధించి ఎలాంటి వివరణా ఇవ్వలేదు.
లోటును పూరించడానికి ప్రభుత్వానికి ఉన్న ఒకేమార్గం నోట్లు ముద్రించుకోవడమే.దీని వలన రూపాయి విలువ తగ్గుతుంది.దీనినే ద్రవ్యోల్బణం అంటారు.గత 60 ఏళ్ళుగా అమలుజరుగుతున్న లోటుబడ్జట్టు విధానం ధనికులను మరింత ధనికుల్ని చేసింది.పేదలను మరింత పేదలను చేసింది.ప్రజోపయోగకరమైన ఆస్తుల సృస్టికి పూనుకోలేదు.పైగా ప్రభుత్వ రంగ సంస్తల ఆస్తులు కారు చౌకగా అమ్మి గుత్తాధిపతులకు అప్పగించారు. ప్రజా ధనంతో తాము నిర్మిచవలసిన రోడ్లను ప్రైవేటు పరం చేసి,వారు టోలు గేటు రూపంలో ప్రజలను విపరీతంగా దోచుకు తినేందుకు వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు ఈ లిస్టులో చేరాయి.లోటు బడ్జెట్టుతో ప్రజాధనాన్ని సెజ్ లకు ప్రభుత్వం తరలిస్తుంది.అధికారంలోనూ,ప్రతిపక్షంలోనూ ఉన్నపార్లమెంటరీపార్టీలన్నీ సెజ్ లను వాటికి కేటాయించిన కంపెనీలే తమ స్వంత నిధులతో నిర్మిస్తాయని ,ప్రభుత్వ ధనాన్ని వాటికి ఇవ్వమని పదే పదే అంటున్నాయి. ఇది పచ్చి అబద్దం. వీటికి అవసరమైన భూమిని ప్రభుత్వం సేకరిస్తుంది. నష్టపరిహారం చెల్లిస్తుంది.దీనికి బడ్జట్టు నుండి నిధులు కేటాయిస్తుంది. ఇంతేకాక వీటికి ప్రభుత్వం అనేక పన్నులలో రాయతీలనిస్తుంది. అంటే ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని వదలుకొంటుంది.ఆ కంపెనీలకు ఆ మేరకు డబ్బులు మిగులుతాయి.ఇది ఏడాదికి ఒక లక్ష కోట్ల రూపాయలుంటుంది.ఇలా ప్రతి ఏడాదీ వుంటుంది.బడ్జెట్టులో ఆమేరకు ప్రతి యేడాదీ లోటు వుంటుంది.అంటే సెజ్ లకూ, వాటి యజమానుల లాభాలకూ బడ్జట్టు నుండి నిధులు తరలుతున్నాయి.ఈ దోపిడీలో పార్లమెంటూ,రాస్త్ర శాసనసభలూ ప్రత్యక్ష పాత్రను కలిగివున్నాయి.చిదంబరం దాచిపెట్టజూచింది ఈ అంశాన్నే.
పారిశ్రామిక రంగం 8 శాతం వృద్ధిరేటు సాధిస్తుండగా ,వ్యవసాయరంగం 2.3 శాతంతో వెనుకబడిపోయిందనీ ఆయన ఆందోళన చెందాడు.ఈ 'ఆందోళన ' వెనుక వ్యవసాయరంగాన్ని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టాలన్న లక్ష్యం వుంది. లక్షలాది కోట్లు పారిశ్రామిక రంగానికి కట్టబెట్టినా పరిశ్రమలు మూతబడుతున్నాయి. జనాభాలో 5 శాతానికి కూడా ఇవి అందడం లేదు. పరిశ్రమలు మూతబడుతున్న, కార్మికుల ఉపాధి తగ్గుతున్నా ,కార్మికుల వేతనాలు తగ్గుతున్నా గుత్తాధిపతుల ఆస్తులూ,లాభాలు పెరిగిపోతున్నాయి. అదే వ్యవసాయ రంగానికొస్తే ,నీటిపారుదల లేదు; విద్యుత్తు సరఫరా లేదు; సంస్థాగతరుణాలు లేవు; గిట్టుబాటు ధర లేదు.ఈ బాధ్యతల నుండి ప్రభుత్వం తప్పుకొంటున్నది.వ్యవసాయాన్ని వెనుకబడినదిగా చిత్రించి , దానిని పరుగులెత్తించే పేరుతో బహుళజాతికంపెనీల పరం చెయ్యాడంకోసమే వ్యవసాయ రంగాన్ని నిందించ బూనుకున్నారు.

No comments: