Tuesday, January 20, 2009

కాశ్మీరు పై కామ్రేడ్ ఏ.కే.ఘోష్ ప్రశ్నలకు సమాధానం

తమ స్థాయి స్థితిని పరిష్కరించుకొనే అవకాశం ప్రజలకివ్వటమూ, ఐరాస లేదా దాని వెనుక నున్న ఆంగ్లో అమెరికన్ సామ్రాజ్యవాదుల జోక్యాన్ని నివారించటమూ కాశ్మీరు సమస్య పరిష్కారానికి కేంద్ర అంశాలని మేము భావిస్తున్నాము.
భారత పాకీస్తానులు నిర్యుద్ధ ఒప్పందం పై సంతకాలు చెయ్యాలని , ఐరాస నుండి కాశ్మీరు సమస్యను ఉపసంహరించాలని , దేశం నుండి ఐరాస ప్రతినిధి వెళ్ళిపోవాలనీ , శాంతియుతంగానూ, ప్రజాస్వామ్యయుతంగానూ, కాశ్మీరు సమస్యకు పరిష్కారం కనుగొనాలనీ భారత కమ్యూనిష్యుపార్టీ కేంద్ర కమిటీ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కాశ్మీరు సమస్య పరిష్కారాన్ని సరీగ్గానే చెప్పింది.
కాశ్మీరు సమస్య పరిష్కారంలో అమెరికా బ్రిటీషు సామ్రాజ్యవాదుల జోక్యానికి తగిన భూమిక నేర్పరస్తుంది గనుక ఐదు పెద్ద దేశాల పర్యవేక్షణలో ప్లబిసైట్ ( జనాభిప్రాయసేకరణ ) ను సమర్ధించటం సరైంది కాదు.
కాశ్మీరు ప్రజల ప్రయోజనాలు , ఆకాంక్షలను పరిగణనలోనికి తీసుకుంటూ కాశ్మీరు భారత్లో చేరాలా లేక స్వతంత్రంగా ఉండాలా అన్నదానిని రాజ్యాంగ సభ నిర్ణయించాలనీ భారత కమ్యూనిష్టు పార్టీ అధికారికంగా ప్రకటించాలి. దీనితో పాటే భారత్ లో చేరే నిర్ణయాన్ని కాశ్మీరు ప్రజలూ, రాజ్యాంగ సభ తీసుకునే విధంగా భారత కమ్యూనిష్టు పార్టీ అన్ని చర్యలూ తీసుకోవాలి.
రాజ్యాంగ సభ సమావేశమవటానికి షరతుగా కాశ్మీరు నుండి భారత పాకీస్తాను సైన్యాలు వైదొలగాలన్న డిమాండును ప్రస్తుతానికి పెట్టరాదు.
కాశ్మీరు సమస్యపై కమ్యూనిష్టు పార్టీ తన వైఖరిని నిర్ణయించుకునే టప్పుడు , పాకీస్తాన్ పాలకుల వైఖరి కంటే షేక్ అబ్దుల్లా ,భారత ప్రభుత్వాల వైఖరి ప్రజాస్వామిక శిబిరానికి ఆమోదకరమన్న అంశాన్ని పరిగణన లోనికి తీసుకోవాలి. కాశ్మీరు పాకీస్తానులో చేరితే , అది కాశ్మీరు బానిసత్వానికి, ఈ ప్రాంతంలో అమెరికా సామ్రాజ్యవాదం పెరగడానికి దారి తీస్తుంది.
సాయుధ బలంతో కాశ్మీరును కలిపేసుకునేందుకు పాకీస్తాను ప్రయత్నిస్తే , పాకీస్తానుకు భారత సైనిక సమాధానాన్ని పాకీస్తానుకు వ్యతిరేకంగా కాశ్మీరు విముక్తికి సైనిక సహాయంగా పేర్కొంటూ మద్దతు తెలపాలి.
-జె.స్టాలిన్
కేంద్ర కమిటీ కార్యదర్శి

No comments: