Thursday, August 14, 2008

పార్లమెంటరీ ప్రహసనం

వామపక్ష కూటమి యూపీఏ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న జులై 7వ తేదీ నుండి పార్లమెంటు విశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగిన జులై 22వ తేదీ వరకూ సాగిన ఘటనల క్రమమంతా భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయిందో తేటతెల్లం చేసింది.బడా పరిశ్రమాధినేతలు నడుంబిగించి బరిలోకిదిగారు.హత్యలూ, కిడ్నాపులవంటి తీవ్ర నేరారోపణలతో జైలులో వున్న ఎంపీలు విడుదలై వచ్చి, సగౌరవంగా పార్లమెంటులో ప్రవేశించి మైనారిటీ ప్రభుత్వాన్ని బలపరచారు. ఇతర దేశాల రాయబారులు రాజకీయ పార్టీల నేతలను కలసి మంతనాలాడారు. అరుపులూ, నోట్ల కట్టల ప్రదర్శనల మధ్య అసలు మీద ఏ చర్చా జరగకుండానే విశ్వాస తీర్మానం నెగ్గింది. ఆ తర్వాత పార్టీ నిర్ణయాన్ని మీరారంటూ దాదాపు అన్ని పార్టీలూ తమ సభ్యులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టబోవడం గమనిస్తే , ఈ బేరసారాలు లేకపోతే ప్రభుత్వం ఓడిపోయి వుండేదన్నది అందరికీ అర్ధమైన విషయమే.

No comments: