Tuesday, April 7, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 6

హెగెల్ యొక్క సక్రమ ధర్మతత్వం పై మార్క్స్ రాసిన విమర్శనాయుత పరిశీలన 1844 లో ప్యారిస్ లో ప్రచురింపబడింది. ‘ మతంపై మార్క్సిస్టు విమర్శనాయుత పరిశీలనకు మగ్నాకార్టా ( హక్కుల పత్రం ) ’ గా ఈ రచనను పిలుస్తారు. ఇందులో మార్క్స్ ‘ మనిషి మతాన్ని తయారు చేస్తాడు. మతం మానవుడ్ని తయారు చేయదు. మతం అంటే తన యొక్క తనం నుండి తాను ఇంకా విజయం పొందని మనిషి లేదా అప్పటికే తనయొక్క తనాన్ని తాను మరోసారి పోగొట్టుకున్న మనిషి యొక్క ఆత్మ చైతన్యం మరియు ఆత్మ గౌరవం. అయితే మనిషి ప్రపంచానికి బయట గొంతు కూర్చొని ఉన్న నైరూప్యమైన జీవి కాదు. మనిషి, మానవుని యొక్క , రాజ్యం యొక్క సమాజం యొక్క ప్రపంచానికి చెందిన వాడు. ఈ రాజ్యమూ , సమాజమూ మతాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మతం ప్రపంచము యొక్క విలోమ చైతన్యం. ఎందుకంటే అవి ఒక విలోమ ప్రపంచం....... మతం మానవ సారాంశం యొక్క వింతైన ( అసహజ ) వాస్తవికత. ఎందుకంటే మానవ సారాంశం ఏవిధమైన నిజ వాస్తవికతనూ సముపార్జించలేదు గనుక. అందువలన మతానికి వ్యతిరేకంగా పోరాటం అంటే పరోక్షంగా మత సుగంధం గల ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి వ్యతిరేక పోరాటం.
మతపరమైన వ్యధ అంటే వాస్తవమైన వ్యధ యొక్క వ్యక్తీకరణ. అదే సమయంలో నిజమైన వ్యధకు వ్యతిరేకంగా నిరసనను తెలియజేయడం. మతం అణచబడ్డ జీవియొక్క నిట్టూర్పు; హృదయం లేని ప్రపంచం యొక్క హృదయం. ఆత్మ లేని పరిస్తితుల యొక్క ఆత్మ. ఇది ప్రజల యొక్క నల్లమందు ‘ అంటూ ప్రకటించాడు.
ఆ రకంగా ఇక్కడ మతాన్ని ‘ నిజమైన వ్యధ యొక్క వ్యక్తీకరణ ’ అంటూ ‘ అణచిపెట్టబడిన వారికి ఒక అవసరమైన దు:ఖోపశమనం ’ అంటూ మార్క్స్ మతం పట్ల ఒక నిజమైన సానుభూతిని చూపించాడు. అణచిపెట్టబడిన వారిని , సంపన్నుల మాదిరిగా నల్లమందు లాంటి దు:ఖోపశమనాలు అందుబాటులో ఉండవు. విలోమంగా ఉన్న ప్రపంచానికి విలోమంగా ఉన్న ప్రపంచానికి వింతైన ( అద్భుతావహమైన ) వ్యక్తీకరణగా ఉన్న మతానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడాన్ని అణచిపెట్టబడ్డవారు ఇంకా నేర్చుకోలేదు. స్కూలు పరీక్ష కోసం రాసిన ‘ క్రీస్తుతో విశ్వాసం గలవారి సంలీనం ’ అన్న తన వ్యాసంలో తాను తీసుకున్న వైఖరికి పూర్తిగా వ్యతిరేకమైన వైఖరిని తీసుకున్న కార్ల్ మార్క్స్ ‘ భ్రమాపూర్వకమైన ఆనందాన్ని ప్రజలకు ఇచ్చి మతాన్ని రద్దు చెయ్యాలన్నది , ప్రజల యొక్క వాస్తవమైన ( పాదార్ధిక ) ఆనందం కోసం చేసే డిమాండ్ ’ అంటూ వాదించాడు.
ఈ రకంగా వాదించిన కార్ల్‌ మార్క్స్ ‘ క్రైస్తవ మతానికి హేతువుతో సఖ్యపడడం కుదరదు. ఎందుకంటే ‘ లౌకికతత్వం ’, ’ ఆధ్యాత్మికతలు ’ ఒకదానిని మరొకటి పూర్తిగా వ్యతిరేకించుకుంటాయి ’ అంటూ ఆయన తన మత ధర్మశాస్త్రపు , సృష్టి పథకం యొక్క వాదాలను నిశితంగా విమర్శించాడు.
‘ విలోమ ప్రపంచానికి ’ సాధారణ సిద్ధాంతం గానూ, విజ్ఞాన సర్వస్వ సారాంశం గానూ ఉన్న మతాన్ని విమర్శనాయుతంగా పరిశీలించటమన్నది, ఆ విలోమ ప్రపంచాన్ని విస్తృతంగా విమర్శనాయుత పరిశీలన జరపడానికి మొదటి మెట్టు అవుతుందని మార్క్స్ భావించాడు.
‘ స్వర్గం పై చేసిన విమర్శ , భూమియొక్క విమర్శ పైకి మళ్ళుతుంది. మత ధర్మశాస్త్రం పై విమర్శ రాజకీయ శాస్త్ర విమర్శకు మళ్ళుతుంది. అందువలన మతంపై విమర్శనాత్మక పరిశీలనే తత్వశాస్త్రాన్ని, విజ్ఞానశాస్త్రాన్నిసాధ్యం చేసింది ’ అని మార్క్స్ తెలియజేశాడు.
ఈరకంగా ఆయన స్వర్గంపై చేసిన విమర్శ , భూమిపై విమర్శకు మళ్ళింది.

Monday, April 6, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 5

అది ఆకస్మికతే. దాన్నే తప్పనిసరిగా అంగీకరించాలి- జనబాహుళ్యం నమ్ముతున్నట్లు దేవుడుకాదు...... పేదరికంలో నివసించడం అన్నది దురదృష్టం. కానీ పేదరికంలో జీవించడం అన్నది ఒక అవసరం కాదు. అన్ని వైపులా స్వాతంత్యానికి తేలిక అయిన దగ్గరి మార్గాలు తెరిచివున్నాయి. ....పేదరికాన్నే ( అవసరాన్నే) లొంగదీసుకోవడం అన్నది అనుమతించబడింది ‘ అన్న ఎపిక్యురస్ చెప్పిన అభిప్రాయాలు కార్ల్ మార్క్స్‌ ను ఆ అభిప్రాయాల వైపు మరింత దగ్గరగా ఆకర్షించాయి. ‘ గ్రీకు సారస్వత తత్వశాస్త్రం యొక్క ఆఖరి రూపాలు – ప్రత్యేకించి ఎపికరియన్ తత్వరూపాలు – నాస్తిక, భౌతికవాదానికి దారితీస్తే, గ్రీకు మోటు తత్వశాస్త్రం ఒకే ఒక దేముడు, మానవుని ఆత్మ యొక్క మరణం లేని నిత్యత్వ సిద్ధాంతానికి దారితీసింది ’ అని తదనంతరకాలంలో ఏంగెల్స్ రాశారు. మార్క్స్ తన డాక్టరేట్ చర్చా వ్యాసాన్ని , థీసిస్ గా ప్రకటించేటప్పుడు దానికి ముందు మాటలు ఎపిక్యూరిస్, ప్రొమేథియస్ లను జ్ఞానకాంతి తెచ్చినవారిగా గుర్తిస్తూ ‘ సాదా మాటల్లో చెప్పాలంటే నేను ఆదేముళ్ళ మూకను అసహ్యించుకుంటాను ’ అని ప్రొమేథియస్ తన అభిప్రాయాన్ని ఒప్పుకోవడం అన్నది, తత్వశాస్త్రం యొక్క స్వయాంగీకారం అనీ, అది మానవుని ఆత్మ చైతన్యాన్ని అత్యున్నతమైన దైవత్వంగా అంగీకరించని స్వర్గంలోని , నరకం లోని దేముళ్ళందరికీ వ్యతిరేకంగా తత్వశాస్త్రం యొక్క స్వయంగా చేసిన క్లుప్తమైన సూత్రీకరణ అని రాశారు.
మార్క్స్ తన డాక్టరేట్ కోసం వ్రాసిన చర్చా వ్యాసానికి అనుబంధంగా ఎపిక్యురస్‌కి వ్యతిరేకంగా ఫ్లూటార్ష్ రాసిన వివాదాస్పద వ్యాసంపై తన విమర్శనాత్మక పరిశీలనా వ్యాసాన్ని కూడా చేర్చాడు. ఈ విమర్శనాత్మక పరిశీలన ఒక ప్రత్యేక తరహాకు చెందినది. ఇది మేధస్సును మతధర్మశాస్త్రీకరించడానికి, తత్వశాస్త్రానికీ గల సంబంధం గురించి బలంగా చెప్పింది. ఎపిక్యురస్‌కు వ్యతిరేకంగా రాసిన వివాదాస్పద చర్చా వ్యాసం ద్వారా ఫ్లూటార్ష్ మతనైతికతనూ, తెలివైనసృష్టి వాదాన్ని ముందుకు తీసుకుపోవాలని చేసిన ప్రయత్నంలో ఆయన తత్వశాస్త్రాన్ని మతవేదికకు ముందున పెట్టాడు. మార్క్స్ , డేవిడ్‌హ్యూం పక్షం వహిస్తూ ప్రకృతి పట్ల హేతుబద్ధ వైఖరి గల తత్వశాస్త్రమే విజ్ఞానశాస్త్రానికి హక్కుదారైన రాజు అనీ, సహజమత ధర్మశాస్త్రం యొక్క శాస్త్రీకరింపబడిన మేధస్సు కాదని మార్క్స్ ప్రకటించాడు.
భగవంతుడిపట్ల ఉండాల్సిన అవసరమైన భయాన్ని తొలగించినందుకు గాను ఎపిక్యూరస్‌ను ఫ్లూటార్ష్ తీవ్రంగా విమర్శించాడు. అన్నిటికన్నా మరణానంతరం భయం అన్నది మానవులను భగవంతునికి కట్టిపడేసింది. అందుకే మార్క్స్ ఫ్లూటార్ష్ ను గురించి చెబుతూ అతడు, ‘ ఇంద్రియ సంబంధమైన చైతన్యానికి అధోలోకంలో సంభవించబోయే భయంకరమైన విషయాలను సమర్ధించే.................. భయంలో, నిర్దిష్టంగా అంతర్గతంగా ( మానవునిలో ) ఉన్న భయాన్ని ఆర్పజాలమనీ సమర్ధించే , సిద్ధాంతాలనూ వెల్లడించే ప్రతినిధి అనీ , ఈ సిద్ధాంతాలు మనిషిని ఒక జంతువుగా నిర్ణయించాయనీ ’ మార్క్స్ తన పరిశీలనలో పేర్కొన్నాడు.
ఫ్లూటార్ష్ యొక్క దేముడు , మార్క్స్ కు ‘ దిగజారిపోయిన దేముడు ’ . ఫ్లూటార్ష్ స్వయంగా ‘ సామాన్య ప్రజానీకం యొక్క నరకాన్ని’ గురించి బోధించే ప్రతినిధి. మార్క్స్ తన పరిశీలనలో ఫ్రెంచ్ భౌతికవాదీ, ఎపిక్యూరియన్ తత్వవేత్త అయిన డీహోలబాష్ యొక్క ‘ ప్రకృతి వ్యవస్థ ’ అన్న రచనలో చెప్పిన ఈ వ్యాఖ్యానాలను పేర్కొంటాడు. ‘ ప్రకృతిని మించిన అతీత శక్తి ఒకటి ఉందని, ఆ అతీత శక్తి ముందు హేతు, తర్కాలు మౌనంగా పడివుండాలనీ, ఆ అతీత శక్తి ముందు మనిషి తనకున్నదంతా త్యాగం చెయ్యడం ద్వారా ఆనందాన్ని పొందాలనీ , మానవులకు బోధించి అంగీకరింప చెయ్యడాన్ని మించిన ప్రమాదం మరొకటి లేదు. ’
‘ హేతు తత్వం లేకపోవడం వలన దేముడు ఉనికిలో ఉన్నాడు ’ అనీ, దేముడున్నాడు అని చూపించే ఆధారాలనబడేవాటన్నిటినీ మార్క్స్ కొట్టిపారవేశాడు.
ఈ చర్చావ్యాసంలో మార్క్స్ తనను హెగెల్ అభిప్రాయాలనుండి విడగొట్టుకున్నాడు. మార్క్స్ , ఏంగెల్స్‌లు తమ ‘ పరిత్ర కుటుంబం ’ అన్న రచనలో హెగెల్ యొక్క తత్వం ‘ ఆత్మకు - పదార్ధానికి , దేముడికీ – ప్రపంచానికి మధ్య గల విరుద్ధాంశాలను గురించిన జర్మన్ క్రిష్టియన్ పిడివాదం యొక్క ఊహాకల్పన యొక్క వ్యక్తీకరణ ’ అని తెలియ జేశాడు.
హెగెల్ యొక్క తర్కానికి మార్క్స్ ‘ పవిత్ర గృహం ’ అనే పేరు పెట్టాడు. వాన్‌లువీన్ ఎత్తిచూపినట్లు హెగెల్ యొక్క ఈ ‘ పవిత్ర గృహం ’ అన్నది మాడ్రిడ్ లోని రోమన్ కథోలిక్ మతగురువుల న్యాయసభ ‘ తమయొక్క కారాగారానికి పావనత్వం కలిగించి ’, ‘ భీభత్స గృహానికి ’ పవిత్రతను ఆపాదించినట్లుందని , మార్క్స్ తన ‘ హెగెల్ విమర్శనాత్మక పరిశీలన ’ లో పేర్కొన్నాడు. లుడ్విగ్ ఫాయర్‌బా యొక్క మతాన్ని గురించిన విమర్శనాత్మక పరిశీలన ప్రక్కప్రక్కనే మతంపై మార్క్స్ యొక్క స్వతంత్ర విమర్శనాత్మక పరిశీలన కూడా అభివృద్ధి చెందింది. హెగెల్ యొక్క ఆదర్శవాద తత్వాన్ని లుడ్విగ్ ఫాయిర్‌బా నిరాకరించిన విషయం మార్క్స్ పై గట్టి ప్రభావాన్ని పడేసింది.

Sunday, April 5, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 4

1837లో బేకన్‌ను చదవడం వల్లనే భౌతికవాదానికి , విరుద్ధంగా భావవాదాన్ని ఉంచే సమస్య మార్క్స్‌కు తట్టడం జరిగితే , ఆయన 1837 లో రీమారస్‌ను చదవడం వలన కూడా అటువంటి సమస్య ఆయన ఆలోచనలో తలెత్తిందని చెప్పడం ఎంతమాత్రం అబద్ధం కాదు. మార్క్స్ కాలం నాటికి , హెర్మన్ సామ్యూల్ రీమారస్ బాగా ఎరిగున్నవాడే. ఆయన తన ‘ సమర్ధన లేదా సహేతుకంగా భగవంతుని పూజించే వారిని సమర్ధిస్తూ ’ అన్న గ్రంధం నుండి సేకరించిన 1774 – 78 కాలం నాటి ఉల్ఫెన్ బట్టల్ ఫ్రాగ్మెంట్స్ అన్న గ్రంధం ఆయన మరణానంతరం ప్రచురించ బడింది. ఆయన హేతువాదానికి ప్రాతినిధ్యం వహిస్తూ , క్రీస్తును గురించి బైబులు వెల్లడించిన విషయాల యదార్ధత గురించి డీయస్టులు చేసిన విమర్శనే చేస్తూ , క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరాకరిస్తూ రాసిన ప్రాగ్మెంట్స్ అన్న గ్రంధం జర్మనీలో కలవరాన్ని సృష్టించింది. ఆ తర్వాతి శతాబ్దంలో డేవిడ్ స్ట్రాస్ రాసిన ‘ జీసెస్ జీవితం ’ అన్న గ్రంధానికి గొప్ప ఆదరణ లభించింది. రీమారస్ తర్కశాస్త్రం పై రాసిన గ్రంధం వల్ల ప్రధానంగా తాను అందరి ఎరుకలోకి వచ్చాడు. కానీ రీమారస్ 1754లో రాసిన ‘ సహజ మత ధర్మశాస్త్రం ’, ‘ పశువుల సహజ జ్ఞానం ’ అన్న రెండు ప్రధానమైన గ్రంధాలు మార్క్స్‌ కు ప్రధానంగా గుర్తుపెట్టుకునే గ్రంధాలయ్యాయి. జాన్ రే అనే ఇంగ్లీషు సహజమత ధర్మశాస్త్రజ్ఞునికి రీమారస్ అనుయాయుడు. రీమారస్ తన ‘ సహజ మతం యొక్క ప్రధాన వాస్తవాలు ’ అన్న గ్రంధంలో , పురాతన ఎపికరస్ వాదులు ‘ తెలివైన సృష్టి ’ని గురించి చేసిన విమర్శనాయుత పరిశీలనకు రీమారిస్ బలమైన ప్రతివాదనలు చేసి , ఆధునిక ఎపికరస్ వాదుల అశాస్త్రీయ వాదాలకు వ్యతిరేకంగా కూడా బలమైన ప్రతిపాదనలు చేసాడు. పరిణతి చెందిన రీమారస్‌కు పశువుల ప్రవర్తనకు సంబంధించిన వివరణ భగవంతుడు కానీ, అనుభవం కానీ వాటిని ప్రత్యక్షంగా కనబడని జ్ఞానాలలో ఎక్కడా కానరాలేదు. కానీ నిర్జీవమైన చోదకములు అనే భౌతికపరమైన వ్యవస్థలో అందుకు గల వివరణ కానవచ్చింది. రీమారస్ యొక్క ఈ ‘ చోదక వ్యవస్థల ’ సిద్ధాంతం మార్క్స్‌ పై ప్రముఖమైన ప్రభావాన్ని పడవేసింది. రీమారిస్ యొక్క ఈ అభిప్రాయంతో స్ఫూర్తిపొందిన మార్క్స్ , ఈ చోదక వ్యవస్థ సిద్ధాంతాన్ని మానవుల శ్రమను సహజవాస్తు శిల్పులైన తేనెటీగలతో పోల్చి ఇరువురి మధ్యగల ప్రత్యేక లక్షణాలను గుర్తించాడు. అయితే మార్క్స్ రీమారస్ కన్నా న్యూటన్ తరహాకు చెందిన దైవ విశ్వాసం ఉన్న మతాచారాల పట్ల విముఖత ప్రదర్శించే వాదానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. మార్క్స్ న్యూటన్ విజ్ఞాన శాస్త్రపు సూత్రాలకు దృఢంగా కట్టుబడి ఉండటంతో న్యూటన్ పక్షానికే ( వాదనలలో ) చేరాడు. న్యూటన్ తన ‘ ప్రిన్సిపియా ’ అన్న రచనలో భగవంతుడే ప్రపంచానికి ఆత్మ అన్న భావాన్ని బలంగా నిరాకరించాడు. ‘ విశ్వపరిపాలకుడే ’ ఆత్మలన్నిటిపై ఆధిపత్యాన్ని కలిగివున్నాడు అన్న వాదనను న్యూటన్ వ్యతిరేకించాడు. న్యూటన్ తీసుకున్న ఈ వైఖరి అన్నది మతం వేరూ, విజ్ఞానశాస్త్రపు విషయ నిర్ణయాధికారం వేరు అన్న అంశానికి పాక్షికంగా గుర్తింపును ఇచ్చినట్టు అవుతుంది.
భౌతికవాదాన్ని గురించిన, సృష్టి పధకాన్ని గురించిన ఈ భావనలన్నీ ఢాక్టరేటు కోసం కారల్ మార్క్స్ వ్రాసిన చర్చా వ్యాసంలో వ్యక్తం చేయబడ్డాయి. ‘ ప్రకృతిని గురించి డెమోక్రటియస్ తత్వానికి ఎపిక్యూరిస్ తత్వానికి మధ్య గల వ్యత్యాసం ‘ అన్న మార్క్స్ యొక్క ఈ చర్చా వ్యాసం 1841 నాటికి పూర్తి చేయబడి ఆమోదించబడినది. ఈ వ్యాసంలో ఆయన ప్రధానంగా ఎపిక్యూరస్ తత్వాన్ని విశ్లేషించడం కోసం ఆయన డెమోక్రటిస్ తత్వాన్ని ఒక సాధనంగా చేసుకున్నాడు. మార్క్స్ యొక్క ఈ చర్చా వ్యాసం యొక్క ప్రధాన సారాంశమంతా ఎపికరియన్ అణువాదం లేదా భౌతికవాదపు సారాంశం అనీ, విశ్లేషణ హెగేలియన్ పద్ధతిలో గతి తార్కిక విశ్లేషణా విధానం అవలంబింప బడిందనీ, ఫలితంగా మార్క్స్ యొక్క తాత్విక దృష్టి ఆయన యొక్క ఆలోచనను భౌతికవాదం ఆదర్శవాదముల మధ్య జరిగే ఘర్షణకు అన్వయించడం వైపుకు ఆకర్షించబడింది అనీ ఎల్. థాపర్ అనే తత్వశాస్త్రజ్ఞుడు వివరించాడు.

Saturday, April 4, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 3

ఆ తర్వాత 1837 నవంబరులో బెర్లిన్ నుండి కార్ల్ మార్క్స్ తన తండ్రికి రాసిన ఉత్తరం పేర్కొన దగినది. ఈ ఉత్తరంలో ఆయన ఇప్పటికే పూర్తిగా జీర్నించుకున్న హెగెల్ తత్వంలోని “ విలక్షణమైన ఎగుడు దిగుడు శ్రావ్యత ” ను గురించి సంఘర్షణ పడడాన్ని , హెగెల్ విధానములోని భావవాదపు సారాంశాన్ని ప్రతిఘటించడాన్ని మనం గమనిస్తాం. “ గతంలో దేముళ్ళు భూమికి పైన ఉన్న లోకాల్లో నివసిన్తే , ఇప్పుడు ( హెగేల్ తత్వప్రకారం) భూమి వారి నివాస కేంద్రమైంది. ” అంటూ వ్రాశాడు. ఆరకంగా హెగేల్ తత్వం ‘ వాస్తవంలో నుండి భావాన్ని వెతుకుతుంది ’ అంటూ తనపై హెగేల్ భావం పూర్తిగా ప్రభావం కలిగియున్నప్పటికీ తాను అటువంటి భావంనుండి ‘ తన శత్రువు యొక్క బాహువుల్లోకి ’ అందించబడ్డాననీ, తాను ‘ అసహ్యించుకునే అభిప్రాయం యొక్క విగ్రహాన్నితయారు చేశాననీ ’ ఆ ఉత్తరంలో ఆయన రాశారు. అయితే ఆయన అదే సమయంలో యువ హెగేలియన్ల ‘ డాక్టర్స్’ క్లబ్బులో కూడా చేరాడు. అందులో హెగెల్ యొక్క తత్వాన్ని గురించి , మతాన్ని గురించిన విమర్శనాయుత పరిశీలన గురించే అనంతమైన చర్చలు జరిపాడు.
హెగేలియన్ తత్వం పై పడే సంఘర్షణల మధ్యలో మార్క్స్ ‘ అనుకూల అధ్యయనం ’ వైపు మళ్ళాడు. ప్రాన్సీస్ బేకన్ యొక్క జర్మనీకి చెందిన ప్రకృతి మత శాస్త్రవేత్త అయిన హెర్మన్ శామ్యూల్ రీమారస్ ల యొక్క రచనలను ఆయనపరిశీలించాడు. మార్క్స్ ఆలోచనపై బేకన్ యొక్క ప్రభావం చాలాకాలం పాటు ఉన్నదన్నది నిస్సందేహం. మార్క్స్ బేకన్ ను పూర్వకాలపు అణువాదులైన డెమోక్రటిస్ , ఎపిక్యూరస్ లకు ఆధునిక కాలపు భౌతికవాద ప్రతిరూపంగా పరిగణించాడు. 1830 దశకం చివరిలోనూ , 1940 దశకం మొదటి కాలం లోనూ , ఇంచుమించు ఒకే కాలంలో మార్క్స్ ,డార్విన్లు ఇద్దరూ బేకన్ యొక్క లక్ష్యాత్మకవాద వ్యతిరేక దృక్పధాన్ని సొంతంగా ఆమోదించి, అనుసరించారు. బేకన్‌యొక్క దృక్పథం , పూర్వకాలపు భౌతిక వాదుల భావంనుండి సంతరించకొన్నది. ‘ ప్రకృతి యొక్క మూలం అంతిమ కారణంలో ఉంది ’ అని భావించే ఏ అవగాహన అయినా ‘ భగవంతునికి దత్తం చేయబడ్డ కన్య ఏరకంగా పిల్లల్ని కనలేని గొడ్డుమోతురాలో , అటువంటి గొడ్డుమోతుది ’ అన్నదే పూర్వకాలపు భౌతికవాదుల దృక్పథం.
ఈ విధంగా వేల సంవత్సరాల కాలంగా , ప్రకృతికి భాష్యం చెప్పటం కోసం భౌతికవాదానికీ, భావవాదానికీ మధ్యా, విజ్ఞానశాస్త్రానికీ, భగవద్‌సృష్టివాదానికీ మధ్యా జరుగుతున్న మహత్తర సంఘర్షణ, బేకన్ యొక్క ఆలోచన ద్వారా , చిన్న వయసు లోనే మార్క్స్‌పై తన ముద్రను వేసింది. ఏంగెల్స్ చెప్పినట్లు 18వ శతాబ్దపు ప్రబోధాత్మక జ్ఞానోదయం “ క్రైస్తవ దేవుడికి బదులు మానవుడు ఎదుర్కొని ఘర్షణ పడాల్సిన సంపూర్ణ విషయంగా ప్రకృతిని అతడి ముందు నిలబెట్టింది. ” ఆవిధంగా ‘ పధకం ప్రకారం సృష్టి ’ ‘ లక్ష్యాత్మక వాదంపై ’ ఆధారపడ్డ ఇతర భావవాదపు వాదాలన్నిటి వాదాల తర్కంలోంచీ భౌతిక వాదం ఉద్భవించింది. ఈవిషయాన్నే ఏంగెల్స్ నిర్ణాయకంగా ఇలా చెప్పారు. “ దేముడు ప్రపంచాన్ని సృష్టించాడా ? లేక ప్రపంచం నిత్యమై శాశ్వితంగా ఉందా ? ”. ఈ ప్రశ్నకు జవాబులిచ్చిన తత్వవేత్తలు రెండు మహా శిబిరాలుగా విడిపోయారు. ఏదోఒక రూపంలో ప్రకృతికి ముందుగానే ప్రాణం ఉనికిలో ఉందనీ స్థిరంగా చెప్పే ( ఇటువంటి తత్వవేత్తల్లో ఒకరు హెగెల్. ఉదాహరణకు క్రిష్టియానిటీ చెప్పినదానికన్నా ఈ సృష్టి తరచుగా మరింత సంక్లిష్టమైంది, అసాధ్యమైనదిగా మారిపోతుంది అన్నభావం ) వారందరితో కూడి – భావవాద శిబిరంగా ఏర్ఫడింది. ప్రకృతే ముందుగా ఉనికిలో ఉందని పరిగణించే వివిధ తరహాల తత్వవేత్తలందరితో కూడి మరో శిబిరం – భౌతికవాద శిబిరం ఏర్పడింది. భావవాదం, భౌతికవాదం అన్న ఈ రెండు భావ వ్యక్తీకరణలు ప్రధానంగా ఇంతకు మించిన విషయాన్నీ, భావాన్నీ వ్యక్తం చెయ్యవు. అందువలన ఈ భావ వ్యక్తీకరణను ఇంతకు మించిన అర్ధంలో ఇక్కడ ఉపయోగించలేదు.